మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పేరేచర్ల గ్రామంలో వరదరాజుల ఆలయంతో పాటు, ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు ఎమ్మెల్యే శ్రీదేవికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ ధర్మాన్ని, విలువలను కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు సీతారమ చంద్రడని ఎమ్మెల్యే శ్రీదేవి పేర్కొన్నారు. భారతీయులకు శ్రీరామచంద్రుడు ఇష్టమైన దైవమన్నారు. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర భార్యాభర్తల బంధం అజరామరమైనదని, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని సీఎం తెలిపారు. సీతారాముల వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవి ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో మేడికొండూరు మండలం ఎంపీపీ మన్నవ స్వప్న రాజేష్, మండల పార్టీ అధ్యక్షులు తాళ్లూరి వంశీకృష్ణ, పలువురు వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa