ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమర్శలకు తావిస్తున్న...మంత్రుల తీరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 10:05 PM

ఏపీలో కొత్తగా మంత్రులగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారు ప్రవర్తించిన తీరు కాస్త విమర్శలకు తావిస్తోంది. ఏపీ కొత్త మంత్రులు సీఎం జగన్ పట్ల తమ విధేయత చాటుకున్నారు. ఇలా ప్రమాణం చేశారో లేదో.. అలా వెళ్లి జగన్ కాళ్ల మీద పడ్డారు. ప్రమాణం అనంతరం కొందరు గవర్నర్ బిశ్వభూషణ్ , సీఎం జగన్ కు నమస్కరించి వెళ్లిపోగా.. కొందరు మాత్రం కాళ్లపై పడ్డారు. మంత్రి నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్ జగన్ కాళ్లకు తాకి నమస్కారం చేశారు. గుడివాడ అమర్ నాథ్, జోగి రమేశ్ లు ఇంకాస్త ఎక్కువగా తమ విధేయతను చూపించారు. మోకాళ్లమీద వంగి కాళ్లకు నమస్కరించారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రోజా జగన్ వద్దకు వెళ్లి కాళ్లకు మొక్కారు. ఆయన చేతినీ ముద్దాడారు. ఇలా ఎవరికివారు జగన్ పై తమకున్న విధేయతను చాటుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa