ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంగ్లాడ్ లో ఉపాధ్యాయ వృత్తిపై తగ్గుతున్న ఆసక్తి

international |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 02:46 AM

ఇప్పటివరకు మనం  సాఫ్ట్ వేర్ రంగాలలోనే ఒత్తిడి అధికమని వినివుంటాం. కానీ ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఒత్తిడి ఉంటుందని ఇటీవలే తేలింది. ఏ దేశంలోనైనా ఉపాధ్యాయ వృత్తికి చాలా ప్రత్యేకత ఉంది. కేవలం టీచర్లు మాత్రమే ఎంతోమంది సైంటిస్టులను, డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేయగలరు. విద్యాబుద్ధులను, సంస్కారాన్ని నేర్పించి దేశానికి మంచి పౌరులను అందించగలరు. అందుకే టీచర్లంటే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. అయితే ఇంగ్లాండ్‌లో మాత్రం టీచర్లు ఆ వృత్తిలో కొనసాగలేకపోతున్నారు. అక్కడ చాలామంది తమ ఉద్యోగాలను మానేయాలనుకుంటున్నారు. ఎంత వీలైతే అంత తొందరగా ఆ వృత్తి నుంచి బయటపడాలనుకుంటున్నారు. ఈ విషయం రీసెంట్‌గా చేసిన ఓ సర్వేలో తెలిసింది.


బౌర్న్‌మౌత్‌లో నేషనల్ యూనియన్ యాన్యువల్ సర్వే ప్రకారం అక్కడ 2027 నాటికి 44 శాతం మంది టీచర్లు తమ వృత్తిని వదిలేయాలనుకుంటున్నారు.1,788 మంది ఉపాధ్యాయులపై జరిపిన సర్వేలో 22 శాతం మంది రెండేళ్లలోపు తమ ఉద్యోగాలను వదిలేయాలనుకుంటున్నట్టు చెప్పారు. చాలామంది ఐదేళ్లలో ఎలాగైనా ఈ ప్రొఫెషన్‌ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. వీరంతా అధిక పనిభారం, పని ఒత్తిడి కారణంగానే ఈ వృత్తిని వదిలేయాలనుకుంటున్నట్టు తెలిపారు.


పనిభారం, నిరంతర పర్యవేక్షణ, రాతపనిల వల్ల నిరాశగా ఉంటుందని ఉపాధ్యాయులు చెప్పారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులు మరింత దిగజారాయని అన్నారు. అలాగే పాఠశాలల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, మార్చి 2020 నుంచి టీచింగ్ అసిస్టెంట్, సపోర్టింగ్ స్టాఫ్ సమస్య అధికంగా ఉందని వెల్లడించారు. తక్కువమంది స్టాఫ్ కారణంగా ఎక్కువ పని చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్‌లో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని ఎన్ఈయూ జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మేరీ బౌస్టెడ్ అన్నారు. ఉపాధ్యాయుల్లో చాలామంది ఎక్కువ పని గంటలు పని చేస్తున్నారని, దీంతో అందరిలో అసంతృప్తి నెలకొందని ఆమె చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa