ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎక్స్ఈ కోవిడ్ వేరియంట్‌ భయపడాల్సిన అసవరంలేదు

national |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 02:47 AM

ఎక్స్ఈ కోవిడ్ వేరియంట్‌ దేశంలో కలకలం రేపుతుంటే దానికి ఏ మాత్రం భయపడాల్సిన అవసరంలేదని కొందరు శాస్త్రవేతలు అభయమిస్తున్నారు. ఎక్స్ఈ కోవిడ్ వేరియంట్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎక్స్ సిరీస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌లు తీవ్రమైన వ్యాధులు కలిగించవని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ చీఫ్ ఎన్‌కె అరోరా చెప్పారు. అదేవిధంగా భారత డేటా ప్రకారం వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం లేదని కూడా అన్నారు. " ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌లకు దారి తీస్తోంది. ఇటువంటి వేరియంట్‌లు వస్తూనే ఉంటాయి. కొత్త వేరియంట్‌లపై భయపడాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇది వేగంగా వ్యాప్తి చెందడం లేదు." అని అరోరా చెప్పారు.


ఇదిలావుంటే ఇప్పటికే మన దేశంలో రెండు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. మహారాష్ట్రలోని ముంబైలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌ఈ కేసు నమోదైనట్టు నిర్ధారణ అయింది. పూర్తిస్థాయిలో టీకాలు తీసుకున్న 67 ఏళ్ల వ్యక్తికి ఈ వేరియంట్‌ సోకినట్టు వైద్యులు గుర్తించారు. అదే విధంగా గుజరాత్‌లోని ఒక రోగికి కరోనా వైరస్ ఎక్స్‌ఈ వేరియంట్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో వైద్య అధికారులు, ఇతర అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యారు.


ఇదిలావుంటే ఎక్స్ఈ వేరియంట్‌ కేసులు తొలుత బ్రిటన్‌లో వెలుగు చూశాయి. తర్వాత థాయిలాండ్, న్యూజిలాండ్ దేశాల్లోనూ నమోదయ్యాయి. ఈ వేరియంట్ ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది. ఇతర వేరియంట్‌ల కంటే ఎక్స్‌వే వేరియంట్ పది శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని బ్రిటన్ పరిశోధకులు కూడా అంచనా వేశారు. మరోవైపు చైనాలో కరోనా విలయం సాగుతోంది. ఎంత కఠినమైన ఆంక్షలు, లాక్‌డౌన్‌లు పెట్టినా అక్కడ కోవిడ్ వైరస్‌ కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. ఇలా కరోనా దశల వారీగా దేశాలపై విరుచుకుపడుతూనే ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa