పిఠాపురం పట్టణంలోని రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ శాసనసభ్యులు వర్మ 29, 30 వ వార్డులో జరిగే జగన్ పాలనంతా బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బాదుడేబాదుడు కార్యక్రమం ఈ నెల 17వ తారీఖు లోపలి అన్ని గ్రామాలలో మరియు వార్డులల్లో పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. అదే విధముగా పెంచిన విధ్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని ఖండిస్తూ నిరసన చేపట్టి, ఇంటింటి తిరుగుతూ కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు మరియు బాదుడే బాదుడు కరపత్రాన్ని అందరికి అందజేయడం జరిగింది.
వ్యవసాయానికి అప్రకటిత విధ్యుత్ కోతలతో పంటలు ఎండి తీవ్రంగా నష్టపోతున్న రైతులు, వ్యవసాయానికి 9గంటలు నిరంతర విద్యుత్ సరఫరా హామీని గాలికి వదిలేసినది వైసిపి ప్రభుత్వం అని, ఓ వైపు వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడుతూ రైతులను మోసం చేసినదని, రైతులు నీటి తిరువా పన్నులు కూడా అధికంగా పెంచారని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కర రావు, సురవరపు సుబ్బారావు, పెచేటి వీరు నాయుడు, ఇమ్మిడిశెట్టి సోనబాబు, అందుగుల సత్తిబాబు, కోరుప్రోలు శ్రీను, కోళ్ళ బంగారుబాబు, పెదిరెడ్ల నంది, సిద్ధాన్తపు ప్రదీప్, మట్ట గణేష్, రాయవరపు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa