ఆదోని వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి ధర క్వింటా రూ. 11, 809 పలికింది. పత్తి క్వింటానికి రూ. 380 తగ్గింది. గత నెల రోజులకు పైగా రూ. 10 వేలు పత్తి ధర కొనసాగి ఇప్పుడు రూ. 12 వేలకు చేరువలో కొనసాగుతుండటంతో రైతుల ఆనందానికి హద్దులేవు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా పత్తి కనిష్ట ధర రూ. 6, 000, మధ్య ధర రూ. 9, 851, గరిష్ట ధర రూ. 11, 809 వరకు పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మంగళవారం మార్కెట్కు 356 (1701 క్వింటాళ్లు) లాట్స్ పత్తి వచ్చినట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa