కర్ణాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. తన ఆత్మహత్యకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కారణమని చనిపోయే ముందు బాధితుడు ఆరోపించాడు. మంత్రి ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారంటూ తన సూసైడ్లో లేఖలో సంతోష్ పాటిల్ పేర్కొన్నాడు. ఈ ఘటన తెలియగానే ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. మంత్రిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి బసవ్రాజ్ బొమ్మై స్పందించారు. విచారణ నిష్పాక్షికంగా జరపాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మంత్రి ఈశ్వరప్పతో పాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ పేర్లను కూడా చేర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa