ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. అత్యాచారం చేసి ఇంటి ముందు పడేశాడు!

national |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 12:25 PM

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలున్నా, కొందరు కామాంధులు బరితెగిస్తున్నారు. కనీసం సమాజం ఏమనుకుంటుందో అని కూడా ఆలోచించడం లేదు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా బాధితురాళ్లను హతమార్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. యువతిపై అత్యాచారం చేసిన యువకుడు బాధితురాలిని ఆమె ఇంటి ముందే పడేశాడు. ఆ తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోవడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ సమీపంలోని సంత్ కబీర్ నగర్‌లో 22 ఏళ్ల యువతిపై ఓ యువకుడు కన్నేశాడు. ఆమెపై ఇటీవల అత్యాచారం చేసి, తీవ్రంగా కొట్టి గాయపర్చాడు. అనంతరం యువతిని ఆమె ఇంటి ముందే పడేసి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు బాధితురాలిని గోరఖ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. దీనిపై ఎస్పీ డాక్టర్ కౌస్తుభ్ సప్ందించారు. ఏప్రిల్ 9న ప్రమోద్ చౌదరి అనే వ్యక్తి తనపై అత్యాచారం చేసి, తీవ్రంగా కొట్టాడని బాధితురాలు మరణానికి ముందు రికార్డ్ చేసిన వీడియోలో ఉందని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa