ప్రస్తుత సమాజాంలో మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి కొందరు బాలికలపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా చెల్లిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. అతడి వల్ల ఆమె గర్భం దాల్చింది. ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్తే వైద్యులు ఆమె వయసు చూసి ఆశ్చర్యపోయారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని ఓ ఎస్టీ కాలనీకి చెందిన దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గొడవల కారణంగా కొన్నేళ్ల కిందట భార్యాభర్తలు విడిపోయారు. ఈ క్రమంలో భర్త వదిలేసిన ఓ మహిళకు ఆ వ్యక్తి దగ్గరయ్యాడు. మొదటి భర్త వల్ల అప్పటికే ఆ మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇరువురూ తమ పిల్లలతో ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. ఆ వ్యక్తికి 20 ఏళ్లున్న పెద్ద కుమారుడు, 12 ఏళ్ల వయసు ఉన్న ఆ మహిళ కుమార్తెపై కన్నేశాడు. సవతి తల్లి కుమార్తెపై అతడు చేసిన అఘాయిత్యం వల్ల ఆ బాలిక గర్భం దాల్చింది. బాలికకు నాలుగు నెలల గర్భం వచ్చినప్పుడే విషయం తల్లిదండ్రులకు తెలిసింది. 9 నెలలు పూర్తయ్యాక బాలిక తల్లి ప్రసవం కోసం నెల్లూరు ఆసుపత్రికి సోమవారం తీసుకెళ్లింది. చిన్న వయసులోనే గర్భం దాల్చడంపై వైద్యులకు అనుమానం తలెత్తింది. వారు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసుల విచారణలో బాలిక తల్లి జరిగిన విషయాలన్నీ చెప్పింది. దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa