ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కనుమరుగైపోతున్న సైకిళ్ళు.. మ్యూజియంలోనే చూడాల్సివస్తుందా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 01:30 PM

స్వాతంత్రం వచ్చి 2000వ సంవత్సరం వరకు సైకిల్ హవా కొనసాగింది. వివిధ రకాల మోడల్స్ లో సైకిల్స్ రావడంతో ప్రజలు వాటిని కొనుగోలు చేసి సైకిల్ తొక్కేందుకు అప్పట్లో ఆసక్తి చూపించారు.


మారుతున్న కాలక్రమంలో మనిషి జీవన విధానంలో వేగం పెరిగింది. ప్రతి విషయం వేగంగా చేయాలనే తాపత్రయంతో మనిషి సుఖంగా, సులభంగా పని అయిపోవాలని ఆలోచిస్తున్నాడు. ఆ క్రమంలో బద్దకస్తుడుగా మారుతున్నారు.


ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 2000వ సంవత్సరం వరకు ఎక్కడ చూసినా అధిక సంఖ్యలో సైకిల్లు మాత్రమే దర్శనమిచ్చేవి. మారిన నాగరికత, ప్రతి పని వేగంగా అయిపోవాలని మనిషి సుఖాన్ని కోరుకుంటున్నాడు. అధిక మొత్తంలో ద్విచక్ర వాహనాలు ప్రజలు కొనుగోలు చేస్తూ తమ పని వేగంగా, సులభంగా అయిపోవాలని ఆలోచిస్తున్నారు.


దీంతో రోజురోజుకు సైకిల్ ప్రస్థానం దిగజారుతూ వస్తుంది. గతంలో పాఠశాలలకు, కాలేజీలకు సైకిల్స్ వేసుకునే వస్తున్న విద్యార్థులు కూడా నేడు ద్విచక్ర వాహనాలు తీసుకువచ్చే స్థాయికి ఎదిగిపోయారు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు మనిషి కష్టం చేయడం మరచిపోయాడని. మరి ఇది ఇలాగే కొనసాగితే సైకిళ్ళని మ్యూజియం లోనే చూడాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.


సైకిల్ తొక్కడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువు తగ్గించడంతో పాటు మనిషి దేహాన్ని దృఢంగా తయారు చేస్తుందని అంటున్నారు. ఇక పర్యావరణాన్ని కూడా కాపాడిన వారవుతారు అని సలహా ఇస్తున్నారు.


ద్విచక్ర వాహనాలు ఎక్కువగా వాడటం వల్ల శరీరానికి బద్ధకం ఏర్పడి మనిషి ఊబకాయానికి గురవుతారని ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని వైద్యులు అంటున్నారు. మనుషులతో పాటు పర్యావరణానికి మేలు జరగాలంటే సైకిల్ వాడటం వల్ల ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు. మరి రానున్న రోజుల్లో సైకిల్ ప్రస్థానం కనుమరుగై పోతుందో లేదా తిరిగి నూతన ఒరవడి సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa