చిత్తూరు నగర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని నగరపాలక సంస్థ నూతన కమిషనర్ జె. అరుణ చెప్పారు. బుధవారం ఉదయం నగర కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ పనిచేస్తూ చుడా వైస్ ఛైర్మెన్ గా బదిలీపై వెళ్తున్న పి. విశ్వనాథ్ నూతన కమిషనర్ జె. అరుణకు బాధ్యతలు అప్పగించారు. పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్ జె. అరుణ మాట్లాడుతూ. చిత్తూరు కమిషనర్ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు పంచాయతీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో విధులు నిర్వహించాలని చెప్పారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారిగా, విజయవాడ అడిషనల్ కమిషనర్ గా, యుసీడీ ప్రాజెక్ట్ అధికారిగా. పని చేసినట్లు వివరించారు. ఏపీ టిడ్కో, హౌసింగ్, నవరత్నాలు, ఇతర ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉందని. నగర పాలక సంస్థ పరిధిలో ఈ సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారు. పారిశుద్ధ్య పర్యవేక్షణ పై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని, సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తానన్నారు.
అంతకుముందు కమిషనర్ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. నగర మేయర్ ఎస్. అముదను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన జె. అరుణను డిప్యూటీ మేయర్ ఆర్ రాజేష్ కుమార్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. సహాయ కమిషనర్ శ్రీలక్ష్మి , విభాగాల అధికారులు కమిషనర్ ను కలిసి అభినందనలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa