సోషల్ మీడియాను మంచికి వాడుకుంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూడండి. రాజస్థాన్కు చెందిన మీనా జొమాటోలో పనిచేస్తున్నాడు. బైక్ లేక 42 డిగ్రీల మండుటెండల్లో సైకిల్పై వెళ్తూ ఫుడ్ అందిస్తున్నాడు. అతడి కష్టం చూసి ఆదిత్యశర్మ అనే వ్యక్తి బైక్ కోసం రూ.75,000 కావాలని, విరాళాలు ఇవ్వాలని ట్విట్టర్లో అభ్యర్థించారు. 4 గంటల్లోనే డబ్బు అందడంతో బైక్ కొని ఇచ్చారు. కొత్త బైక్ చూడగానే మీనా భావోద్వేగానికి గురయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి సైకిల్పై తాను ఆర్డర్ చేసిన ఫుడ్ను టైమ్కి తెచ్చిచ్చాడని, అతని కష్టాన్ని గుర్తించి రాజస్థాన్కు చెందిన ఒక వ్యక్తి అతనికి బైక్ కొనడానికి సహాయం చేశాడు. ఆదిత్య శర్మ ఈ పోస్ట్ను ట్వీట్ చేశాడు. ఆదిత్య ఇలాంటి కష్టపడే ఓ వ్యక్తి బైక్ కొనడానికి సహాయం చేయమని ట్విట్టర్లో క్రౌడ్ ఫండింగ్ను కోరిన కొన్ని గంటల్లోనే ఎంతో మంది ఈ మంచి పనికి సహకరించారు.
అయితే, 31 ఏళ్ల ఈ డెలివరీ బాయ్, 12 సంవత్సరాలు ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. కోవిడ్ కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. కుటుంబం నడపడానికి డెలివరీ బాయ్గా పనిచేయాల్సి వచ్చింది. అతని కథ తెలుసుకున్నఆదిత్య ఎక్కువ సమయం వృధా చేయలేదు. క్రౌడ్ ఫండింగ్తో రూ. 75,000 సేకరించాడు. అయితే, ఒక్కరోజులోనే ఇంత పెద్ద మొత్తం రావడంతో అతడు సంతోషంగా బైక్ కొనిచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa