ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటనకు భారీ బందోబస్తు..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 16, 2022, 01:29 PM

మచిలీపట్నం జిల్లా పరిషత్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహావిష్కరణకు ఈ నెల 18న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరుకానున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా సూచించారు. గురువారం పిన్నమనేని విగ్రహావిష్కరణ ఏర్పాట్ల పై కలెక్టర్‌ రంజిత్‌ బాషా, ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌, గుడివాడ బాబ్జీ, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, ఏఎస్పీ ఎస్‌. వి. డి. ప్రసాద్‌, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఐ. కిషోర్‌, డీఎస్పీ మసూంబాషాలు సమీక్షించారు. 


ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఏఏ శాఖలు ఏఏ ఏర్పాట్లు చేయాలో సూచించారు. ఉపరాష్ట్రపతి రిమోట్‌ ద్వారా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. విగ్రహావిష్కరణ కార్య్రకమం ప్రజలు, ప్రజాప్రతినిధులు చూసేందుకు వీలుగా ఎల్‌ఈడి స్ర్కీన్లు ఏర్పాటు చేయాలన్నారు. జడ్పీ కన్వెన్షన్‌ హాలు వద్ద వీఐపీల కార్లు పార్కింగ్‌ చేయాలన్నారు. ఉపరాష్ట్రపతి 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారని, ఆత్కూరులో స్వర్ణభారత్‌ ట్రస్టులో రాత్రి బస చేస్తారన్నారు. 18వ తేదీ ఉదయం 9. 30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటారని, 10 నుంచి 11 గంటల వరకు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 


అనంతరం ఉపరాష్ట్రపతి స్వర్ణభారత్‌ ట్రస్టుకు బయలుదేరి వెళతారన్నారు. ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ మాట్లాడుతూ, వీఐపీ రూట్‌మ్యాప్‌, కాన్వాయ్‌ సిద్ధం చేయాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ మహే్‌షకుమార్‌ మాట్లాడుతూ, మునిసిపల్‌ కార్పొరేషన్‌, వీఐపీలు పర్యటించే రహదారి వెంబడి శానిటేషన్‌, తాగునీటి సరఫరా చేయాలన్నారు. విద్యుత్‌శాఖ ద్వారా అవసరమైన జనరేటర్లను ఏర్పాటు చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa