ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకుని మూల్యం చెల్లించుకుంది

sports |  Suryaa Desk  | Published : Sat, Apr 16, 2022, 11:23 PM

ముంబాయి ఇండియన్స్ క్రికెట్ జట్టు కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకుని మూల్యం చెల్లించుకుందని క్రికెట్ ఆట విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐపీఎల్ తాజా సీజన్ లో ముంబయి ఇండియన్స్ కు ఏమాత్రం కలిసిరావడంలేదు. ఇవాళ కూడా ఓటమిపాలైంది. లక్నో సూపర్ జెయింట్స్ తో పోరులో భారీ లక్ష్యఛేదనలో పోరాడి ఓడింది. 200 పరుగుల ఛేదనలో 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ముంబయి జట్టుకు విజయం సాధించేందుకు అవకాశాలు లభించినా, కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకుని మూల్యం చెల్లించుకుంది.


ముంబయి ఇన్నింగ్స్ లో డివాల్డ్ బ్రెవిస్ 31 పరుగులు (13 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ 37, తిలక్ వర్మ 26 పరుగులు చేశారు. ఆఖర్లో కీరన్ పొలార్డ్ (14 బంతుల్లో 25) విజృంభించినా, అతడికి సహకారం అందించేవాళ్లు కరవయ్యారు. భారీ షాట్లు కొట్టే యత్నంలో అవుటయ్యారు. లక్నో బౌలర్లలో అవేష్ ఖాన్ 3, జాసన్ హోల్డర్ 1, దుష్మంత చమీర 1, రవి బిష్ణోయ్ 1, మార్కస్ స్టొయినిస్ 1 వికెట్ తీశారు. 


ఇదిలావుంటే ఈ సీజన్ లో ముంబయి ఇండియన్స్ కు ఇది ఆరో ఓటమి. తద్వారా ఓటముల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించినట్టయింది. ఇక, ముంబయి వరుసగా మ్యాచ్ లు గెలిచినప్పటికీ ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసినట్టే భావించాలి. అటు, లక్నో సూపర్ జెయింట్స్ తాజా విజయంతో పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది. ఆ జట్టు 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa