గ్రూపు విభేదాలతో నెల్లూరు జిల్లా వైసీపీలో కాక మొదలైంది. నెల్లూరు జిల్లా వైసీపీలో అంతర్గత పోరు రచ్చకెక్కింది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య నెలకొన్న వివాదం తీవ్రతరమైంది. మంత్రి కాకాణి కోసం నెల్లూరులో రేపు సభను నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అనిల్ కుమార్ యాదవ్ కూడా కార్యకర్తలతో బహిరంగసభను ఏర్పాటు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను ఈరోజు అనిల్ పరిశీలించారు. సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని తన అనుచరులను ఆదేశించారు. అంతేకాదు రాత్రి భోజనంతో పాటు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా అనిల్ తో పాటు పలువురు వైసీపీ నేతలు ఉండటం గమనార్హం.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ సభను నిర్వహించి తీరుతామని చెప్పారు. ఇది ఎవరికీ పోటీ సభ కాదని అన్నారు. మూడు రోజుల ముందే సభకు అనుమతి తీసుకున్నామని తెలిపారు. సభను వాయిదా వేసుకోవాలని పార్టీ హైకమాండ్ కూడా చెప్పలేదని అన్నారు. ఎవరో కార్యక్రమం పెట్టుకున్నారని, తాను సభను పెట్టడం లేదని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa