ఇరువర్గాల ఘర్షణతో పాకిస్థాన్లోని పంజాబ్ అసెంబ్లీ వణికింది. అసెంబ్లీలో సభ్యులు గందరగోళం సృష్టించారు. దీంతో కొత్త సీఎంను ఎన్నుకునేందుకు ఏర్పాటైన సభ రణరంగంగా మారింది. సమావేశానికి అధ్యక్షత వహించేందుకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మంజారీపై పాకిస్థాన్ టెహ్రీక్ ఇ ఇన్సాఫ్ సభ్యులు దాడి చేశారు. లాహోర్ కోర్టు ఆదేశాల మేరకు కొత్త సీఎంను ఎన్నుకోవడానికి పంజాబ్ అసెంబ్లీ శనివారం సమావేశమైంది. ఆ సభను సజావుగా నిర్వహించేందుకు దోస్త్ మహ్మద్ అక్కడకు చేరుకున్నారు.
అయితే ఇమ్రాన్ ఖాన్ పార్టీ సభ్యులు మజారీపై విరుచుకుపడ్డారు. ఆయనపైకి కమలం పువ్వులు విసిరారు. ఆయన చెంపలు వాయించారు. జుట్టుపట్టుకుని హింసించారు. సెక్యూరిటీ గార్డులు కూడా ఈ దాడిని ఆపలేకపోయారు. దాంతో మంజారీ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ రగడ వల్ల 11.30 నిమిషాలకు మొదలవ్వాల్సిన సెషన్ ఆలస్యమైంది. అయితే ఇమ్రాన్ ఖాన్ పార్టీ సభ్యులపై అధికార పార్టీ నేతలు మండిపడ్డారు.
అసెంబ్లీలో జరిగిన రచ్చకి పాకిస్థాన్ అసెంబ్లీ సభ్యుడు అహ్సన్ ఇక్బాల్ ఇమ్రాన్ ఖాన్పై విరుచుకుపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ అన్నిస్థాయిల్లో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఎన్నికను అడ్డుకునేందుకు అసెంబ్లీలో హింసను ప్రేరేపించారని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ హిట్లర్ శిష్యుడినని నిరూపించుకుంటున్నాడని ఇక్బాల్ ట్వీట్ చేశారు. కాగా పాకిస్థాన్లో నాటకీయ పరిణామాల మధ్య ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా వైదొలిగారు. అయినా సరే పాకిస్థాన్లో రాజకీయ అస్థిరత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇరు పార్టీల సభ్యులు గొడవలకు, ఘర్షణలకు దిగుతున్నారు. ఇటీవలె ఓ స్టార్ హోటల్లోని ఇఫ్తార్ విందుకు హాజరైన పార్టీల నేతలు కొట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa