నెల్లిమర్ల, విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని ఇందిరా కాలనీలో వివాహిత కురుపాటి భానుశృతి (27) ఆత్మహత్యకు శనివారం పాల్పడింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత డిసెంబరులో విశాఖపట్నానికి చెందిన అరుణ్ కుమార్తో ఈమెకు వివాహమైంది. ఈనాడు లో వచ్చిన కథనం ప్రకారం, ఆయన హైదరాబాద్ లో ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నారు..ఇటీవల భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.
దీనిపై విజయనగరంలోని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారని అమ్మాయి కుటుంబ సభ్యులు తెలిపారు. అయినప్పటికీ భర్త అరుణ్ కుమార్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మనస్తాపానికి గురైన భానుశృతి కన్నవారింటిలో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి, ఎఫ్ఎ పి.నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa