శృంగవరపుకోట నుండి అరకు వెళ్లే ప్రధాన రహదారి రక్తసిక్తమవుతోంది. అరకు పర్యాటక ప్రాంతం కావడంతో విశాఖపట్నం నుండి తరచూ ద్విచక్ర వాహనదారులతో పాటు కార్లు, ఇతర పలు వాహనాల్లో పర్యాటకులు ప్రయాణం చేయడం పరిపాటిగా మారింది. శృంగవరపుకోట పోలీసులు ఈ రహదారిలో నిత్యం పహారా కాస్తున్నప్పటికీ వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా పలు పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
వాహనదారులు నిర్లక్ష్యంగా అతి వేగంతో ప్రయాణం చేయడం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు ప్రాణాలు కోల్పోతున్న విషాద సంఘటనలు ఈ రహదారిలో చోటుచేసుకోవడంతో ఈ రహదారికి సమీపంలో గల పలు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ రహదారిలో సంభవించిన ప్రమాదాల కారణంగా ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స పొందుతూ గత రెండు రోజుల క్రితం ఓ చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. అలాగే శనివారం ఎస్ కోట నుండి అరకు వెళ్ళే ప్రధాన రహదారిలో శృంగవరపుకోట సమీపంలో లో కారు ఆటో ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణం చేస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన పాఠకులకు విదితమే.
అరకు పర్యాటక ప్రాంతం కావడంతో నిత్యం ఈ రహదారిలో వాహనాల రద్దీ ఉంటున్న నేపథ్యంలో ఇటు శృంగవరపుకోట అటు అనంతగిరి పోలీసుల పర్యవేక్షణ మరింత పెంచి అటు ప్రయాణికులు ఇటు ప్రజల ప్రాణాలను రక్షించే విధంగా చర్యలు చేపట్టాలని అలాగే వాహనదారులు అతి వేగాన్ని నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa