ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జవాన్ల క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి

national |  Suryaa Desk  | Published : Mon, Apr 18, 2022, 12:00 PM

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ధర్బాలో ఆదివారం మావోయిస్టులు చెలరేగిపోయారు. పోలీసు క్యాంపుపై మెరుపు దాడి చేశారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో జైగుర్‌ జవాన్ల క్యాంపుపై మావోయిస్టులు దాడి చేసినట్లు బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు. దాడిలో నలుగురు జవాన్లు గాయపడ్డారని పేర్కొన్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. క్షతగాత్రులను హెలీకాప్టర్‌లో రాయ్‌పూర్‌ ఆసుప్రతికి తరలించినట్లు వివరించారు. మరో ఇద్దరికి బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలియజేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి ఘటనా స్థలానికి అదనపు బలగాలను రప్పించామన్నారు. దాడి చేసిన మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa