ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్నతల్లిని పదేళ్లు గదిలో బంధించిన కుమారులు

national |  Suryaa Desk  | Published : Mon, Apr 18, 2022, 12:02 PM

కన్నతల్లి పట్ల ఇద్దరు కుమారులు కర్కశంగా ప్రవర్తించారు. పదేళ్ల పాటు ఆమెను ఓ ఇంట్లో బంధించి, తాళం వేశారు. ఈ అమానుష ఘటన తమిళనాడులోని తంజావూర్‌ జిల్లా కావేరినగర్‌‌లో చోటు చేసుకుంది. తల్లి జ్ఞానజోతి (72)ని ఆమె కుమారులు షణ్ముగ సుందరం, వెంకటేశన్ పదేళ్లుగా ఓ ఇంట్లో బంధించి ఉంచారు. షణ్ముగ సుందరన్ దూరదర్శన్‌లోనూ, వెంకటేశన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గానూ పని చేసి రిటైర్ అయ్యారు. వారి ఉన్నతికి కారణమైన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యతను విస్మరించారు. సోదరులిద్దరికీ ఆస్తి తగాదాలు ఉండడంతో పదేళ్లుగా బంధించి ఉంచారు. వారానికి ఓ సారి వచ్చి, కిటికీలో నుంచి బిస్కెట్లు వేసేవారు. చూసే వారెవరూ లేకపోవడంతో వారి తల్లి మానసిక స్థితి కోల్పోయింది. చుట్టుపక్కల వాళ్లు జాలిపడి ఏదైనా పెడితే తింటుంది. ఈ విషయాన్ని గుర్తించి ఓ సామాజిక కార్యకర్త కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కావేరి నగర్‌లోని మహిళ నివాసానికి చేరుకున్నారు. ఆమెను చికిత్స కోసం తంజావూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె దుస్థితికి కారణమైన కుమారులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa