ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణస్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 18, 2022, 12:44 PM

ఉపముఖ్యమంత్రిగా నారాయణస్వామి బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఎక్సైజ్ శాఖలో మరణించిన ఇద్దరు ఉద్యోగులకు మెడికల్ రీయింబర్సుమెంట్ విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ. సీఎం జగన్ ఆశయాలతో ముందుకెళ్తామన్నారు. సెబ్, ఎక్సైజ్ శాఖ సహకారం బాగా ఉందని తెలిపారు. తమ శాఖలో చాలా మందిని సస్పెండ్ చేయాల్సి రావడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. అందరి సహకారంతో మద్యపాన నిషేధం చేస్తామని నారాయణ స్వామి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa