జాతీయ ఆరోగ్య మీషన్ ద్వారా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆజాధికా అమృత్ మహోత్సవ్ వేడుకలు, సమితి స్థాయి ఆరోగ్య మేళా జిల్లా వైద్య అధికారి డాక్టర్ యస్. వి. రమణ కుమారి ఆధ్వర్యంలో సోమవారం బొబ్బిలి పట్టణంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పాల్గొని స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులుతో కలసి ఆరోగ్య మేళాను ప్రారంభించారు.
అనంతరం ఆసుపత్రి ఆవరణలో వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన 18 స్టాల్స్ ను ఎమ్మెల్యే శంబంగి జిల్లా వైద్యాధికారిని రమణకుమారితో కలసి పరిశీలించి పలు రకాల వ్యాదులు నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని అక్కడ వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. మనం నాటే ప్రతీ మొక్క భూమి మీద నివసించే ప్రతి జీవి మనుగడకు దోహద పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంబంగి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య మేళాను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, అదునూతన వైద్య నిపుణులు ద్వారా సాధారణ వ్యాధి గ్రస్తులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులుకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు చికిత్స చేస్తారని ఆయన అన్నారు.
ఆయుష్మాన్ భారత్ మిషన్ ద్వారా ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ఐడి కార్డులు జనరేట్ చేయడం జరుగుతుంది అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ నాడు నేడు పథకం ద్వారా ఆసుపత్రిల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని ఆసుపత్రిలు డాక్టర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఆరోగ్య మేళాలో బాగంగా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మొబైల్ బ్లడ్ క్యాంప్ ను ఎమ్మెల్యే శంబంగి పరిశీలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటి ప్రాణాన్ని కాపాడడంలో రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని ఆయన అన్నారు. అందుచేత రక్తం దానం చేయడానికి ప్రతీ ఒక్కరూ స్వచ్చందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి యస్. వి. రమణకుమారి, ఆర్డీఓ పి. శేషశైలజ, మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు, వైస్ చైర్మన్ గోళగాన రమాదేవి, చెలికాని మురళీకృష్ణ, జడ్పీటీసీ సభ్యురాలు సంకిలి శాంతకుమారి, బూడా చైర్మన్ ఇంటి పార్వతి, గోపాలరావు, డాక్టర్ గేదెల శ్రీనివాసరావు, డాక్టర్ శశిభూషణరావు, డాక్టర్ సంతోషికుమారి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa