ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెడన శాసనసభ్యులు, ఇబ్రహీంపట్నం బిడ్డ, గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ కు మంత్రి పదవి ఇచ్చి బీసీలకు సముచిత స్థానం కల్పించారని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కొండపల్లిలో మంగళవారం జరిగిన సభలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ 2009లో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి, జోగి రమేష్ ను పెడన నుంచి పోటీ చేయించి గెలిపించారని పేర్కొన్నారు. అదే వ్యూహాన్ని ఆయన తనయులు సీఎం జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అమలు చేస్తూ జోగి రమేష్ ను పెడనలో పోటీ చేయించి గెలిపించినట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa