ఒకే రోజు ఇద్దరు బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్లు మరణించారు. బంగ్లాదేశ్ తొలి వన్డే జట్టు సభ్యుడు సమియుర్ రెహ్మాన్ (69) మంగళవారం ఢాకాలో కన్నుమూశారు. బ్రెయిన్ ట్యూమర్, డిమెన్షియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. రెహమాన్ 1986 ఆసియా కప్లో పాల్గొన్నాడు. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్కు బంగ్లాకు ప్రాతినిధ్యం వహించాడు.
మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ఆటగాడు మోషారఫ్ హొస్సేన్ (40) కూడా బ్రెయిన్ ట్యూమర్తో మంగళవారం మరణించాడు. మూడేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఆయన సింగపూర్, ఇండియా వంటి దేశాల్లోని ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్యం క్షీణించి మరణించాడు. బంగ్లా తరఫున మోషారఫ్ 5 వన్డేలు ఆడాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa