అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ నగరం మంగళవారం బాంబుల మోతతో దద్ధరిళ్లింది. పశ్చిమ్ కాబూల్ దషత్ ఇ బర్చీ ప్రాంతంలోని బాలుర పాఠశాలలో మూడు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 25 ప్రాణాలు కోల్పోయినట్టు అఫ్గన్ భద్రతా వర్గాలు వెల్లడించారు. మరో 20 మందికిపైగా గాయపడినట్టు తెలిపాయి. మరోసారి షియా ముస్లింలే లక్ష్యంగా ముష్కరులు దాడులకు తెగబడ్డారు. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో షియాలే అధికంగా ఉంటారు. సున్నీలతో పాటు ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద గ్రూపులు వీరిని లక్ష్యంగా చేసుకుంటున్నాయి.
‘‘హైస్కూల్లో జరిగిన మూడు పేలుళ్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.. వీరంతా షియా వర్గానికి చెందినవారే’’ కాబూల్ కమాండర్ అధికార ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు. పేలుళ్లలో కనీసం 25 మంది చనిపోయారని, మరో 29 మందికిపైగా గాయపడ్డారని క్షతగాత్రులకు చికిత్స అందజేస్తున్న ఆస్పత్రికి నర్సింగ్ విభాగం చీఫ్ తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అఫ్గన్లో బాలికల విద్యపై నిషేధం తర్వాత కొద్ది నెలలుగా మూసివేసిన పాఠశాలలను మూడు వారాల కిందటే పునఃప్రారంభించారు.
అయితే, ఈఘటనకు బాధ్యతవహిస్తూ ఇంత వరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. గతేడాది ఆగస్టులో అమెరికా సైన్యాలు వైదొలగిన తర్వాత అఫ్గన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అక్కడ కొంత మేర హింస తగ్గింది. అయితే, తాలిబన్ల పాలనలో వెళ్లడంతో మరోసారి అఫ్గన్ గడ్డపై ఉగ్రవాద సంస్థలు వేళ్లూనుకునే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. ఇస్లామిక్ ఉగ్రవాదులు భారీ దాడులకు కుట్రలకు తెగబడే ప్రమాదం ఉందని కలవరపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa