వియత్నంకు ఓ అందాల హారం వచ్చిచేరింది. దీంతో ఇక పర్యాటకులు వియత్నాంకు వెళ్లేందుకు క్యూ కట్టనున్నారు. ఎందుకంటే అద్భుతమైన కట్టడానికి వియత్నం వేదికైంది. దానిని చూస్తే కచ్చితంగా ఔరా అనక మానరు. ఓ గాజు వంతెనను వియత్నాంలో నిర్మించారు. అందులోనూ ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెన కావడం విశేషం. 2,073.5 అడుగుల పొడవుతో భూమికి ఐదు వందల అడుగుల ఎత్తులో ఉత్తర హైలాండ్స్ టౌన్ మోక్ చౌలో దీనిని నిర్మించారు. ఈ బ్రిడ్జ్కి బాచ్ లాంగ్ అని పేరును కూడా పెట్టారు.
ఈ గ్లాస్ వంతెనని ఏప్రిల్ 30న ఓపెన్ చేయనున్నారు. ఈ బ్రిడ్జ్పై ఒకేసారి 500 మంది మాత్రమే నడవడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. సెయింట్ గోబైన్ అనే ఫ్రాన్స్ కంపెనీ ఉత్పత్తి చేసి ఇచ్చిన సూపర్ టెంపర్డ్ గ్లాస్తో బ్రిడ్జిని తయారు చేశారు. ఇప్పటికే దీనికి భద్రతను అక్కడి అధికారులు పరిశీలించారు. అలాగే వంతెన పొడవు అత్యంత ఎక్కువగా ఉండడంతో దాని గుర్తింపు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యేలా కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే చైనాలో ఓ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. దానిని హునాన్ ప్రావిన్స్లోని జాంగ్ జియాజీ గ్రాండ్ కాన్యన్పై నిర్మించారు. అప్పటి నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. వంతెన నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. 2020 నాటికి పూర్తి చేసి దానిని ఓపెన్ చేశారు. రుయీ బ్రిడ్జ్గా నామకరణం చేశారు. పియాన్ పర్వతంపై అద్దాలతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు. అయితే గాలులు విపరీతంగా వీయడంతో బ్రిడ్జ్ అద్దాలను పగిలిపోయిన సందర్భాలు లేకపోలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa