గుంతకల్లు మండల పరిధిలోని గుర్రబ్బాడు గ్రామానికి చెందిన కురుబ సూర్యనారాయణ (37) సోమవారం రాత్రి ఇంటిలో ఎవ్వరూ లేనిసమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు వివరాలు మేరకు. సూర్య నారాయణ తనకున్న 6. 5 ఎకరాల పొలం లో ఇటీవల ఒక ఎకరాను విక్రయించగా రూ. 8. 90 లక్షలు వచ్చాయి. ఆ డబ్బుతో ఉన్న కొన్ని అప్పులు తీర్చుకుని రూ. 1. 90 లక్షలతో ఒక ఇల్లు కొన్నాడు.
ఈ విషయంలో ఉగాది పండుగ రోజున భార్య కవితలో గొడవలు జరిగాయి. దీంతో కవితను, ఇద్దరు పిల్లలను ఆమె తమ్ముడు పుట్టింటికి తీసుకెళ్లాడు. దీంతో మనస్తాపంతో రాత్రి ఇంటిలోని గవాక్షానికి పంచెతో ఉరి వేసుకున్నాడు. ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమా చారం అందించారు.
ఆమేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉరికి వేలాడుతున్న సూర్య నారాయణ మృతదేహాన్ని క్రిందకు దింపి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి, మృతుడి కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa