ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్రకటిత విద్యుత్ కోతలు.. తీవ్ర భయాందోళనలో విద్యార్థులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 12:42 PM

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగలు రాత్రి అనేది భేదం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ ను నిలిపి వేస్తూ ఉండడంతో ప్రజలు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.


ఇప్పటికే పారిశ్రామిక రంగానికి సంబంధించిన పరిశ్రమలు విద్యుత్ సంక్షోభంతో నష్టాల్లో కూరుకుపోయి నష్టాలను చవిచూస్తున్నాయి. ఇక ప్రజలంతా రాష్ట్రవ్యాప్తంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సమస్యలే కాకుండా ఇప్పుడు మరో కొత్త సమస్య కూడా మన ముందుకు వచ్చింది.


విద్యార్థులకు వరుస పరీక్షలు కాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అప్రకటిత విద్యుత్ కోతలు విద్యార్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పరీక్షలు ఎంతదూరం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.


టెన్త్, ఇంటర్, డిగ్రీ ఇలా మరి కొన్ని కోర్సులకు సంబంధించి ఈ నెల చివరి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరి ఇలాంటి సమయంలో అప్రకటిత విద్యుత్ కోతలు విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలిగించే అవకాశం ఉందని ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అప్రకటిత విద్యుత్ కోతలు ఎందుకు విధిస్తున్నారో కనీసం ప్రజలకు చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ 24 గంటల పాటు ఇవ్వాలని వారి పరీక్షలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకొని అప్రకటిత విద్యుత్ కోతలను నిరోధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa