ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం కొత్త రూల్స్.. కార్లలో అవి తప్పనిసరి!

national |  Suryaa Desk  | Published : Fri, Apr 22, 2022, 12:33 PM

అన్ని కార్లలో 6 ఎయిర్‌ బ్యాగులను తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వాహనదారుల భద్రతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ మార్పుల వల్ల కార్ల ధరలు పెరుగుతాయని చెబుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని కార్ల తయారీ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ప్రమాదాలను నివారించేందుకే కొత్త నిబంధనలు ప్రవేశపెడుతున్నామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ప్రమాద సమయంలో కార్లలో ఎయిర్‌బ్యాగులు ఉన్నట్లయితే కేవలం ఒక్క ఏడాదిలోనే 13వేల ప్రాణాలను కాపాడి ఉండేవాళ్లమని గుర్తు చేశారు. అక్టోబర్‌ 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని వెల్లడించారు.


అక్టోబర్ ఒకటి నుంచి అన్ని కార్లలో 4 సీట్లతోసహా 2 సైడ్ ఎయిర్‌ బ్యాగ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రం జనవరిలో ప్రతిపాదించింది. కానీ, తయారీ సంస్థలు చెబుతోన్న కారణాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వాటిని విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యింది. నిబంధనలకు తుదిరూపు తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అన్ని కార్లలో 2 ఎయిర్‌బ్యాగ్‌ల ఏర్పాటు తప్పనిసరిగా ఉండగా, మరో నాలుగింటి ఏర్పాటు వల్ల అదనంగా వినియోగదారుడికి 75 డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు కాదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కానీ కార్ల తయారీ సంస్థలు మాత్రం ఇందుకు 231 డాలర్ల అదనపు ఖర్చు అవుతుందని చెబుతున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa