తన చెల్లి మరో వ్యక్తితో బైక్పై వెళ్తుండటం గమనించిన అన్న కోపంతో రగిలిపోయి వారిని ఆపేందుకు యత్నించాడు. కానీ వారు అతడిని పట్టించుకోలేదు. దీంతో కోపంతో ఆ యువకుడు వారు వెళ్తున్న బైక్ ను ఓ మినీ ట్రక్కుతో ఢీకొట్టాడు. వాహనం దిగి తన చెల్లెలితో సహా ఆమెతో ఉన్న వ్యక్తిపై దాడికి చేశాడు. గాయపడ్డ ఇద్దరినీ స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. మధ్యప్రదేశ్ భోపాల్లోని అయోధ్య నగర్లో సోమవారం(ఏప్రిల్ 18) ఈ ఘటన జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు అజీం మన్సూరీని పోలీసులు అరెస్టు చేశారు . ట్రక్కు డ్రైవర్ రవిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa