జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏలూరు జిల్లా పర్యటనకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పవన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్లిన ఆయన.. ధర్మాజీగుడెం వద్ద రోడ్డు తవ్వకం పనులు గమనించారు. దీంతో జనసేన నేతలతో కలిసి రోడ్డు తవ్వకం పనులను అడ్డుకున్నారు.
రహదారి పనుల ముసుగులో కౌలు రైతు భరోసా యాత్రను ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని విమర్శించారు.పవన్ వస్తున్నందునే జేసీబీతో అప్పటికప్పుడు తవ్వకాలు చేపట్టారని ఆయన ఆరోపించారు. రహదారి పనుల ముసుగులో పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa