సెల్ ఫోన్ చోరీకి పాల్పడిన యువకుడు తప్పించుకునే క్రమంలో మేడపై నుంచి కిందపడి మృతిచెండాడు. ఈ ఘటన విజయవాడలోని కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విజయవాడ జక్కంపూడి కాలనీ బ్లాక్ నెం.172 జీఎఫ్-1లో కొమ్ము నవజీవన్(28) నివాసం ఉంటున్నాడు. అతడు చెడు వ్యసనాలకు బానిస కావటంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున అదే కాలనీలో నివాసం ఉంటున్న జీవన్ చిన్నమ్మ చాగలమారి జయ ఇంటికి ఇద్దరు చిన్నారులు వచ్చి కాలనీలోని బ్లాక్ నెం 201 వద్ద నవజీవన్ నేలపై పడి ఉన్నాడని చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లి చూసి మాట్లాడలేని స్థితిలో ఉన్న యువకుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బ్లాక్లోని లక్ష్మి ఇంట్లో సెల్ ఫోన్ చోరీ చేసి తప్పించుకునే క్రమంలో మేడపై నుంచి కిందపడి గాయాల పాలైనట్లు తెలుసుకున్నారు. ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే జీవన్ మృతి చెందటంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. జీవన్పై పలు చోరీ కేసులలో నిందితుడని కొత్తపేట పోలీసులు పేర్కొంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa