ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీని అప్పులకుప్పగా మార్చిన జగన్: యనమల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 24, 2022, 11:33 AM

ఏపీని అప్పుల కుప్పగా ముఖ్యమంత్రి జగన్ మార్చారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. తీర్చలేని విధంగా రూ.7.76 లక్షల కోట్ల అప్పుల సుడిగుండంలో ఏపీ కూరుకుపోయిందన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వైసీపీ రాదని జగన్‌కు అర్థమైందన్నారు. అందుకే రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయంగా చేసేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం ఇంతలా మితిమీరి అప్పులు చేస్తుంటే కట్టడి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా ఉందని ప్రశ్నించారు. ఎంతకాలం జగన్ ప్రభుత్వాన్ని రక్షిస్తారని నిలదీశారు.


సీఎం వైఎస్ జగన్ ప్రజల గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని యనమల విమర్శించారు. ఆయన ధ్యాస అంతా కేవలం వారి పార్టీ బాగోగులపైనే ఉందన్నారు. అవినీతి సొమ్ము బాగా వెనకేసుకుని, వచ్చే ఎన్నికల్లో ప్రజలను వాటితో మభ్యపెట్టాలని వారు భావిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. రాష్ట్రానికి ఆదాయం లేదని, దీంతో సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేక రాష్ట్ర ప్రభుత్వం దీన స్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడంపై మాత్రమే దృష్టిసారిస్తున్నారని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa