ఢిల్లీలో అశాంతి నెలకొంటే ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని ఎన్సీపీ నేత శరద్ పవర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని జహంగీర్ పూర్ లో హనుమాన్ జయంతి వేళ చోటు చేసుకున్న మతపరమైన అల్లర్లపై మండిపడ్డారు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ... ఆ అల్లర్లను ఆపడంలో అమిత్షా విఫలమయ్యారని విమర్శించారు. సీఎం కేజ్రీవాల్ ఆ అల్లర్లను నియంత్రించేవారని, కానీ అక్కడి పోలీసులు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటారని ఆయన చెప్పారు. ఆ శాఖను కేంద్ర హోం మంత్రి అమిత్షా చూస్తున్నారని తెలిపారు.
ఆ ఘర్షణలను అమిత్ షా ఆపలేకపోయారని, ఆయన విఫలమయ్యారని చెప్పారు. ఢిల్లీలో ఏ చిన్న ఘటన జరిగినా, ఆ విషయం ప్రపంచమంతా తెలిసిపోతుందని ఆయన అన్నారు. ఢిల్లీలో అశాంతి నెలకొందని తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం ఢిల్లీలోని పరిస్థితులను నియంత్రించలేకపోతోందని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa