ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ అల్లర్లతో ప్రపంచానికి తప్పుడు సంకేతాలు: శరద్ పవర్

national |  Suryaa Desk  | Published : Sun, Apr 24, 2022, 10:16 PM

ఢిల్లీలో అశాంతి నెల‌కొంటే ప్రపంచ దేశాలకు త‌ప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని ఎన్సీపీ నేత శరద్ పవర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని జహంగీర్ పూర్ లో హ‌నుమాన్ జ‌యంతి వేళ చోటు చేసుకున్న మ‌త‌ప‌ర‌మైన‌ అల్ల‌ర్లపై మండిప‌డ్డారు. తాజాగా ఆయ‌న ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని మాట్లాడుతూ... ఆ అల్ల‌ర్ల‌ను ఆప‌డంలో అమిత్‌షా విఫ‌ల‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు. సీఎం కేజ్రీవాల్ ఆ అల్ల‌ర్ల‌ను  నియంత్రించేవార‌ని, కానీ అక్క‌డి పోలీసులు కేంద్ర హోంశాఖ ప‌రిధిలో ఉంటార‌ని ఆయ‌న చెప్పారు. ఆ శాఖ‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చూస్తున్నార‌ని తెలిపారు. 


ఆ ఘ‌ర్ష‌ణ‌ల‌ను అమిత్ షా ఆప‌లేక‌పోయార‌ని, ఆయ‌న విఫ‌ల‌మ‌య్యార‌ని చెప్పారు. ఢిల్లీలో ఏ చిన్న ఘ‌ట‌న జ‌రిగినా, ఆ విష‌యం ప్ర‌పంచ‌మంతా తెలిసిపోతుంద‌ని ఆయ‌న అన్నారు. ఢిల్లీలో అశాంతి నెల‌కొంద‌ని త‌ప్పుడు సంకేతాలు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్ర‌భుత్వం ఢిల్లీలోని ప‌రిస్థితుల‌ను నియంత్రించలేక‌పోతోంద‌ని విమ‌ర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa