కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ ఛార్జీలు, ఆర్టిసీ, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకగా సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం దేవనకొండ మండలంలోని దేవనకొండ, తెర్నేకల్ సచివాలయాల ముందు ధర్న నిర్వహించారు.
సీపీఎం మండల కమిటీ సభ్యులు అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్, రాఘవ రెడ్డి, నాగేష్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో చేపట్టే పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నాగేష్, మహబూబ్ బాష, బజారి, పల్లెదొడ్డి శ్రీరాములు, హనుమన్న, రాయుడు, రాము, కాంతయ్య, రంగడు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa