దేశ రాజధానిలో దాదాపు 10 లక్షల మంది నిర్మాణ కార్మికులకు ప్రయోజనం చేకూర్చే చర్యలో, వారికి ఉచిత బస్ పాస్లను అందించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ, “నిర్మాణ కార్మికులందరూ ప్రయాణానికి గతంలో నెలకు రూ. 1000 నుండి రూ. 3000 వరకు వెచ్చించేవారు. ఇప్పుడు అలాంటి కార్మికులకు బస్సు ప్రయాణాన్ని ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది కూలీలు ప్రయోజనం పొందుతారు.ఢిల్లీలో భవన నిర్మాణ కార్మికులకు ఉచిత బస్ పాస్ పథకం ఈరోజు ప్రారంభించబడింది. నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న వెల్డర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, గార్డులు మరియు ఇతర కార్మికులు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. కూలీలు బాగుండాలనేది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కృషి అని సిసోడియా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa