ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే స్టేషన్ ఆవరణలో వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 05, 2022, 12:37 PM

వేటపాలెం రైల్వే స్టేషన్ ఎదుట ఒక వ్యక్తి మృతి చెంది పడి ఉండగా స్థానికులు అందించిన సమాచారం తో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురువారం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వేటపాలెం ఎస్సై జి. సురేష్ కథనం ప్రకారం రామకృష్ణాపురానికి చెందిన ఏ. శ్రీనివాసరావు(46)కుటుంబ కలహాల నేపథ్యంలో చాలాకాలంగా వేటపాలెం రైల్వే స్టేషన్లోనే ఉంటున్నాడు. పగలంతా కూలి పనులు చేసుకుని వచ్చి రాత్రి రైల్వే స్టేషన్లో పడుకునేవాడు. ఈ క్రమంలోనే అతను నిద్రలోనే మరణించినట్లు భావిస్తున్నామని ఎస్సై చెప్పారు. పోస్టుమార్టం నివేదిక అందాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు కూడా ఉన్నాడని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa