ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతి గొంతు కోసిన వ్యక్తికి మరణ శిక్ష

national |  Suryaa Desk  | Published : Thu, May 05, 2022, 05:00 PM

ప్రేమించానంటూ వెంటపడ్డాడు. ఆ యువతి ఒప్పుకోకపోవడంతో పగతో రగిలిపోయాడు. తన ప్రేమనే తిరస్కరించిందంటూ కక్ష పెంచుకున్నాడు. ఆమె ఇంట్లోకి దూరి, యువతి కుటుంబికులు చూస్తుండగానే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన కేసులో నిందితుడిపై కోర్టు కన్నెర్ర చేసింది. 70 రోజుల్లోనే అతడికి మరణ శిక్ష ఖరారు చేసింది. ఈ సంచలన కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని పసోద‌ర‌లో గ్రీష్మ అనే 21 ఏళ్ల యువతి కుటుంబ సభ్యులతో నివసిస్తోంది. ఆమెతో పాటు కాలేజీలో సహ విద్యార్థి ఫెనిల్ గొయానీ ప్రేమ పేరుతో వేధించాడు. ఇరు కుటుంబాలదీ ఒకే సామాజిక నేపథ్యం ఉండడం, ఒకరికొకరు తెలిసి ఉండడంతో బాధిత యువతి తరుపు వారు ఏమీ అనలేదు. వేధింపులు తీవ్రం అవడంతో గ్రీష్మ కాలేజీ మానేసి ఇంట్లోనే ఉంది. ఆమె తండ్రి ఇంట్లో లేని సమయంలో ఫిబ్ర‌వ‌రి 12న ఫెనిల్ అక్కడకు వచ్చాడు. మరోసారి తన ప్రేమను వ్యక్తం చేయగా, ఆమె తిరస్కరించింది. దీంతో కత్తి తీసుకుని ఆమె గొంతుపై పెట్టాడు. యువతి సోదరుడు, మేనమామ ఆమెను కాపాడాలని చూశారు. అయినప్పటికీ వారందరూ చూస్తుండగానే ఆమె ప్రాణాలు తీశాడు. ఈ కేసులో వాదోపవాదాల అనంతరం నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ బుధవారం కోర్టు తీర్పు ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa