సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకంటూ ఒకరు ఉండాలనుకొని నవమాసాలు మోసి కనకపోయిన తనే సర్వస్వము అనుకునేలా పెంచుకున్న తల్లిని దత్తపుత్రుడు అతి కిరాతకంగా ఆ తల్లిని హత్య చేశాడు. పోలీసుల కధనం ప్రకారం.. పీటీ కాలనీలో నివాసం ఉంటున్న భూదేవి (58) అనే మహిళ తనకు సంతానం లేకపోవడంతో.. గత కొన్ని సంవత్సరాల క్రితం సాయితేజ అనే బాలుడిని దత్తత తీసుకొని ఆలనా పాలనా చూసుకుంటూ పెంచి పెద్ద చేసింది. అక్కడి వరకు బాగానే ఉన్న.. ఆ దత్తపుత్రుడు మద్యానికి బానిసై.. ప్రతిరోజు డబ్బులు ఇవ్వమంటూ తల్లిని వేధించేవాడు. తల్లి అందుకు నిరాకరించేది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న బంగారంపై కన్నేసిన సాయితేజ! తల్లి భూదేవిని హతమార్చాడు. ఇంట్లో ఉన్న 30 తులాల నగలు, నగదు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చేసరికి భూదేవి రక్తపు మడుగులో పడి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమయినా ఇప్పుడిప్పుడే మారుతున్నా సమాజంలో సంతానం లేక పోయిన దత్తత తెచుకోవాలనుకునే వారికీ ఈ ఘటన వారి జీవితాల్లో ఓ విషాద ఘటన వారిని భయబ్రాంతులకు గురయ్యేలా చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa