ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ ఎడిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 67 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించింది. 193 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 19.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సన్రైజర్స్ బ్యాటింగ్లో రాహుల్ త్రిపాఠి 58 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మార్క్రమ్ 21, పూరన్ 19 పరుగులతో ఆలౌట్ అయ్యారు. మిగిలిన వారు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించడం కష్టతరంగా మారింది. ఆర్సీబీ బౌలర్లలో హసరంగ 5 వికెట్లు తీశాడు. హాజెల్ వుడ్ 2, మ్యాక్స్ వెల్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa