ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాజమాన్యాల తీరు మారుతోంది...ఉద్యోగుల పట్ల ఔదర్యం ప్రదర్శన

international |  Suryaa Desk  | Published : Mon, May 09, 2022, 11:55 AM

ఉద్యోగి ప్రతిభను పిండి తీసుకోవడం ఒకపుడు కంపెనీల యాజమాన్యం తీరు ఉండేది. కానీ మారిన పరిస్థిలకు అనుగుణంగా ఉద్యోగులను పీడించడం కాదు ప్రేమతో పనిచేయించుకోవడం ఉత్తమం అన్న దశకు సంస్థలు మారుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత.. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోసం ఉద్యోగులు చూస్తున్నారు. ఈ సమతుల్యతను సాధించేందుకు కంపెనీలు కూడా సరికొత్తగా ఆలోచిస్తున్నాయి. స్టార్టప్‌ కంపెనీలు ఉద్యోగులకు పలు రకాల ప్రయోజనాలను అందిస్తున్నాయి. కనీవినీ ఎరుగని ఈ ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. తమ టాప్ టాలెంట్‌ను బయటికి వెళ్లకుండా చూసుకునేందుకు వేతనాలను పెంచడమే కాకుండా.. తాజాగా బెంగళూరుకి చెందిన స్టార్టప్ వేక్‌ఫిట్ తన ఉద్యోగులకు ఆఫీసులో నిద్రపోయే అవకాశాన్ని కల్పించింది. పని సమయంలో అర్ధగంట సేపు నిద్రపోవచ్చని ఉద్యోగులకు తెలిపింది. వేక్‌ఫిట్ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. ఈ కంపెనీ మాత్రమే కాక, గుడ్ గ్లామ్ గ్రూప్, జాప్టో వంటి సంస్థలు కూడా తమ ఉద్యోగులకు సరికొత్త ప్రయోజనాలను ప్రకటించాయి. వాటిలో పుట్టిన రోజుల నాడు సెలవులు, వెకేషన్ రియంబర్స్‌మెంట్, 5 స్టార్ హోటల్స్ బస వంటివి ఉన్నాయి.


ఈ ఒక్క కార్యక్రమం మాత్రమే ఉద్యోగులపై అంత పెద్ద ప్రభావం చూపదని, ఇలాంటి మరికొన్ని కార్యక్రమాలు కూడా కలిస్తే ఉద్యోగులను సంస్థ నుంచి బయటికి వెళ్లిపోకుండా ఆపుకోగలుగుతామని వేక్‌ఫిట్ చెబుతోంది. నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు పుట్టుకొస్తున్న సరికొత్త అవకాశాలు, ఉద్యోగులతో సంస్థలకు ఎమోషనల్ అటాచ్‌మెంట్ లేకపోవడం వంటివి సంస్థలలో రాజీనామాలకు దారితీస్తున్నాయని వేక్‌ఫిట్ సహ వ్యవస్థాపకుడు చైతన్య రామలింగ గౌడ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు ఉద్యోగులకు ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకొస్తున్నట్టు తెలిపారు.


5 స్టార్ హోటల్‌లో బస..


ఉద్యోగులను ఆకట్టుకునేందుకు ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ డ్రీమ్11 కూడా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత.. ముంబైకి బదిలీ అయిన కంపెనీ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మూడు వారాల పాటు 5 స్టార్ హోటల్స్‌లో బస చేసేందుకు అవకాశం ఇచ్చింది. అంతేకాక హెచ్‌ఆర్‌ఏ కింద లక్ష రూపాయలను కంట్రిబ్యూట్ చేసింది. ఈ పాలసీలతో తమ ఉద్యోగుల్లో మూడింట రెండు వంతుల మంది ఫిబ్రవరిలో ఆఫీసు నుంచే పని చేయడం ప్రారంభించినట్టు తెలిపింది. గ్రోసరీ స్టార్టప్ జాప్టో కూడా ఉద్యోగుల కోసం పలు రకాల ప్రయోజనాలు తీసుకొచ్చింది. ఉద్యోగులకు వెకేషన్ రియంబర్స్‌మెంట్‌ను ఇచ్చింది. దీని కింద ఉద్యోగులు లీవ్ తీసుకున్నా వేతనాన్ని చెల్లించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa