బ్యాంకు రుణగ్రస్థులకు ఆందోళన కలిగించే నిర్ణయం తాజాగా ఆర్భీఐ తీసుకొంది. ఆర్బీఐ సడెన్గా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.40 శాతానికి చేర్చింది. క్యాష్ రిజర్వు రేషియోను 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.5 శాతంగా నిర్ణయించింది. అంతేకాక బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి రూ.82 వేల కోట్ల నుంచి రూ.87 వేల కోట్ల లిక్విడిటీని మెల్లమెల్లగా వెనక్కి తీసుకుంటామని ఆర్బీఐ సంకేతాలిచ్చింది. ఈ ప్రకటనలు కన్జూమర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చాలా బ్యాంకులు తమ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్గా రెపో రేటును వాడుతున్నాయి. ఈ రెపో పెరగడంతో.. వడ్డీ రేట్లను కూడా పెంచుతున్నాయి బ్యాంకులు. బ్యాంకులు ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత లెండింగ్ రేట్లను సవరిస్తూ ఉంటాయి. కానీ ఆర్బీఐ రేట్లను పెంచడంతో.. తాజాగా బ్యాంకులు కూడా ఈ రేట్లను సమీక్షిస్తున్నాయి.
రాబోయే నెలల్లో మరో 100 బేసిస్ పాయింట్ల వరకు ఈ రేట్ల పెంపు ఉంటుందని చాలా మంది ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. ఆర్బీఐ టార్గెట్ జోన్ 4 శాతం నుంచి 6 శాతం మధ్యలో నుంచి దాటిపోయి ద్రవ్యోల్బణం అత్యధికంగా నమోదవుతుండటమే దీనికి గల కారణం. ద్రవ్యోల్బణం భగ్గుమంటుండటంతో.. ఈ ధరల కట్టుబడికి ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలలో వడ్డీ రేట్ల పెంపు కీలకంగా ఉంటోంది. వడ్డీ రేట్లు ఇక కంటిన్యూగా పెరుగుతూనే ఉంటాయని, ప్రస్తుత, కొత్త రుణ గ్రహీతలకు ఈఎంఐలు పెరుగుతాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే చాలా బ్యాంకులు ఆర్బీఐ రెపో రేటు పెంపు ప్రకటన తర్వాత.. తమ గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచాయి. పెరుగుతోన్న ఈ వడ్డీ రేట్ల కాలంలో కొన్ని బ్యాంకులు మార్కెట్లో అత్యంత తక్కువగా గృహ రుణాలపై వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఆ బ్యాంకులేమిటి, ఆ బ్యాంకులలో గృహ రుణాల వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఓసారి చూద్దాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa