విద్యుత్ నిరంతరంగా పోతూనే ఉంటే ఎవరికైనా చికాకే మరి. ఆ చికాకు ఎక్కువై మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామ ప్రజలు ఏం చేశారో తెలుసా. మధ్యప్రదేశ్లో విద్యుత్ కోతలతో విసిగిపోయిన జనం ఏకంగా సబ్స్టేషన్కి నిప్పు పెట్టేశారు. తరచూ కరెంట్ పోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఇంతపని చేశారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇది జరిగింది. దటోడా గ్రామస్థులు సబ్ స్టేషన్ దగ్గరకు చేరుకుని.. రాళ్లు రువ్వారు. కార్యాలయంలో ఉన్న ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారు. అనంతరం విద్యుత్ కంట్రోల్ యూనిట్పై డీజిల్, కిరోసిన్ పోసి నిప్పంటించారు. అందులో కంట్రోల్ యూనిట్, రిలే వ్యవస్థ పూర్తిగా కాలిపోయింది.
అందులో కంట్రోల్ యూనిట్ పూర్తిగా కాలిపోయి దెబ్బతింది. దీంతో పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనిపై రాష్ట్ర విద్యుత్ సంస్థ... సోపిల్ సిమ్రోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు జిల్లా అదనపు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. కాగా మండే ఎండల్లో కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పంటలు కూడా ఎండిపోతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తిరిగే నాయకులు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలావుంటే దేశంలో 12 రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. వేసవిలో కరెంట్ కోతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా బొగ్గు కొరతను నివారించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలాఉండగా మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కృత్రిమ బొగ్గు కొరతను సృష్టించిందని కాంగ్రెస్ నాయకుడు ప్రియావ్త్ సింగ్ ఆరోపణలు చేశారు. ఇతర దేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుని బడా వ్యాపారవేత్తకు ఇచ్చేందుకే ఇదంతా చేస్తుందని విమర్శించారు. మరోవైపు విద్యుత్ సంక్షోభంపై అసెంబ్లీలో చర్చ నిర్వహించాలని విపక్ష నేత గోవింద్ సింగ్ శనివారం సీఎంకు లేఖ రాశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa