ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంకలో చెయ్యిదాటుతున్న ప్రజాగ్రహం...ప్రజల దాడిలో ఓ ఎంపీ మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 09, 2022, 10:14 PM

ప్రజాగ్రహం కట్టలు తెంచుకొంటోంది. పరిస్థితి ఎపుడు ఎలా మారుతుందో చెప్పలేని వాతావరణం శ్రీలంకలో నెలకొన్నాయి. పరిస్థితులు నానాటికీ విషమిస్తున్నాయి. తాజాగా, ఆందోళనకారులతో జరిగిన ఘర్షణల్లో అధికార పార్టీ ఎంపీ ఒకరు మరణించారు. ప్రజాపాలనపై ప్రభుత్వం అదుపు కోల్పోతోందనడానికి ఈ ఘటనే నిదర్శనం. కొలంబో రాజధాని వెలుపల నిట్టంబువా ప్రాంతంలో ఆందోళనకారులు భారీ ఎత్తున గుమికూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. 


ఆ సమయంలో ఎంపీ అమరకీర్తి అతుకోరల తన కారులో అక్కడికి వచ్చారు. ఎంపీని చూడగానే ఆగ్రహంతో ఆందోళనకారులు ఆయన కారును చుట్టుముట్టారు. దాంతో ఎంపీ తుపాకీ తీసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆందోళనకారుల నుంచి తప్పించుకుని సమీపంలోని భవనంలో ఆశ్రయం పొందేందుకు ఎంపీ అమరకీర్తి ప్రయత్నించారు. కాసేపటి తర్వాత ఆయన శవమై కనిపించారు. 


శ్రీలంకలో సంక్షోభం మొదలయ్యాక, కొలంబోలో నేడు అత్యంత తీవ్రస్థాయిలో హింస చెలరేగింది. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు ప్రయోగించాల్సి వచ్చింది. తక్షణమే కొలంబోలో కర్ఫ్యూ ప్రకటించారు. కాగా, శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన రాజీనామా చేసినప్పటికీ, నిరసన జ్వాలలు భగ్గుమంటూనే ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa