ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు వైద్యం చేయడం వల్ల శ్రీరామకృష్ణ అనే లెక్చరర్ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 03:10 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు రోజు రోజుకీ దిగజారుతుండటం వైసీపీ సర్కార్ వైఫల్యాన్ని సూచిస్తోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు వైద్యం చేయడం వల్ల శ్రీరామకృష్ణ అనే లెక్చరర్ మృతి చెందిన ఘటన శోచనీయం. ప్రమాదంలో గాయాల పాలై వచ్చిన వ్యక్తికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నిండు ప్రాణం పోయింది. సమయానికి అంబులెన్సులు రావు... ఆసుపత్రికి వస్తే వైద్యం చేయరు. ఇన్ పేషెంట్లకు బెడ్ కేటాయించరు. ఫుట్ పాత్ మీదే ఉంటూ వైద్యం తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కనీసం చనిపోయిన వారిని తరలించేందుకు వాహనాలు ఇవ్వరు. ప్రతి రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకొంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డిలో కనీసం చలనం రావడం లేదు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆయన ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్ధం అవుతోంది. ఈ శాఖను నిర్వీర్యం చేసిన ఘనత శ్రీ జగన్ రెడ్డిదే. కేంద్ర ప్రభుత్వం నుంచి రూరల్ హెల్త్ మిషన్, అర్బన్ హెల్త్ మిషన్ పథకాల ద్వారా రూ.వేల కోట్లు నిధులు వస్తుంటే.. వాటిని ఎటు మళ్లిస్తున్నారో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కోవిడ్ మృతులకు ఇవ్వాల్సిన ఆర్ధిక సాయాన్ని కూడా పక్కదారి పట్టించినవాళ్ల నుంచి వైద్య సేవలు ఆశించడం అత్యాశే అవుతుంది. ప్రభుత్వం నుంచి వైద్యం సేవలు పొందటం ప్రజలకు ఉన్న హక్కు. ఈ సేవలు అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించి విచారణ చేపట్టాలి అని జనసేన నాయకులూ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa