ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరిగిన మంచు కొండ.. కూలిన బ్రిడ్జి

international |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 03:39 PM

ఉష్ణోగ్రతలు రోజరోజుకు మార్పు చెందుతున్నాయి. కొన్ని చోట్ల అధిక ఎండల వల్ల భూతాపం అధికంగా ఉంది. అధిక భూతాపంతో హిమ పర్వతాలు కరిగిపోయి ఆ నీళ్లతో వరదలు తలెత్తుతున్నాయి. పాకిస్థాన్ లోని గిల్గిత్ బాల్టిస్థాన్ రీజియన్ లో హిమనీనదం అనే పర్వతం కరిగిపోయి వరద వాటిల్లింది. ఆ వరద వల్ల కారాకోరం హైవేపై ఉన్న హసనబాద్ బ్రిడ్జి కూలింది.


అధిక భూతాపం వల్లే హిమనీ నదం కరిగిపోయి నీటి మట్టం పెరిగిపోయిందని, దాని వల్ల వరదలు కూడా సంభవిచాయని నిపుణులు తెలియజేస్తున్నారు. బ్రిడ్జి కూలిపోయిన వీడియోను పాకిస్థాన్ పర్యావరణ మార్పుల మంత్రి, సెనేటర్ షెర్రీ రెహ్మాన్ తన ట్విట్టర్ లో షేర్ చేయగా ఆ వీడియో కాస్తా వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa