తాజ్ మహల్ నిర్మించిన భూమి జైపూర్ పాలకుడు జై సింగ్కు చెందినదని, దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ స్వాధీనం చేసుకున్నారని బీజేపీ ఎంపీ దియా కుమారి బుధవారం పేర్కొన్నారు. గతంలో జైపూర్ రాజకుటుంబానికి సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. తాజ్ మహల్ చరిత్రపై నిజనిర్ధారణ చేపట్టేందుకు అందులోని 22 గదుల తలుపులు తెరవాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్కు కూడా ఆమె మద్దతు ప్రకటించారు. స్మారక చిహ్నంగా తాజమహల్ను నిర్మించారని, అంతకు ముందు అక్కడ ఏమి ఉందో దర్యాప్తు చేయాలని ఆమె కోరింది. వాస్తవాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. జైపూర్ కుటుంబం వద్ద రికార్డులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ఇక బీజేపీ ఎంపీ దియా కుమారి జైపూర్ రాజ వంశస్తురాలు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భూమికి బదులు తమకు నష్టపరిహారం ఇచ్చారని ఆమె తెలిపారు. అయితే అందులో వాస్తవం ఎంత ఉందో తమ వద్ద ఉన్న రికార్డులను అధ్యయనం చేస్తే తెలుస్తుందన్నారు. అయితే ఆ భూమి తమ కుటుంబానికి చెందినదని, షాజహాన్ దానిని స్వాధీనం చేసుకున్నారని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ లేనందున అప్పట్లో అప్పీలు చేసుకోలేదని వివరించారు. రికార్డులను పరిశీలించిన తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa