దేశంలోనే అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంకు తన రూల్స్ ను మార్పు చేసింది. ఈ బ్యాంకు పలు రకాల ఛార్జీలను పెంచింది. ఉచిత లావాదేవీల లిమిట్లో కూడా మార్పులు చేయడంతో కస్లమర్లకు షాక్ తగిలినట్లైయ్యింది. ఈ కొత్త రూల్స్ మే 29వ తేది నుంచి అమలులోకి రానున్నాయి. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్ 0.40 శాతం పెంచి 6.90 శాతం చేసినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. బ్యాంకు తన వడ్డీ రేటును 0.40 శాతం పెంచింది.
గతంలో ఉచిత ట్రాన్సాక్షన్స్ లిమిట్ 40 ఉండగా, ఆ తర్వాత ప్రతీ లావాదేవీపై రూ.2 చొప్పున ఛార్జీ వసూలు చేసేది. అయితే ఇకపై 50 ఉచిత ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతీ లావాదేవీపై రూ.10 చొప్పున ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. చెక్ రిటర్నింగ్ ఛార్జీల విషయంలో కొత్త శ్లాబ్ తీసుకొచ్చింది. రూ.1,00,000 నుంచి రూ.10,00,000 వరకు ఔట్వర్డ్ ట్రాన్సాక్షన్స్పై రూ.250 ఛార్జీలు చెల్లించాలి. రూ.10,00,000 కన్నా ఎక్కువైతే ప్రతీ లావాదేవీకి రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa