ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హద్దు మీరి ప్రవర్తిస్తే తగ్గిన మూల్యం చెల్లించుకోకతప్పదు: కొల్లు రవీంద్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 02:39 AM

రాష్ట్రంలోని అధికార్ల తీరుపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుటుంబానికి నోటీసులిస్తామంటూ ఏపీలో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... అధికారులు హద్దు మీరి ప్రవర్తిస్తే భ‌విష్య‌త్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయ‌న‌ హెచ్చరించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిని కూడా గతంలో అసెంబ్లీలో అవమానించార‌ని అన్నారు. ఇప్పుడు భువనేశ్వరిపై అక్రమ కేసులు బనాయించేలా కుట్ర పన్నుతున్నారని ఆయ‌న ఆరోపించారు. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై తప్పుడు కేసులు పెట్టారని ఆయ‌న చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa