ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిన ఘనత జగన్ దే: నాదెండ్ల మనోహర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 02:40 AM

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి చర్యలను నిరసిస్తూ రాజకీయ ప్రముఖులంతా వైసీపీ సర్కార్ పై మండిపడుతున్నారు. ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందించ‌డంలో అంతులేని నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని ఏపీ స‌ర్కారుపై జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. యాక్సిడెంట్‌లో గాయపడి స‌రైన వైద్యం అంద‌క లెక్చరర్ రామకృష్ణ మృతి చెందిన‌ ఘ‌ట‌న‌పై నాదెండ్ల మ‌నోహ‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో ఏపీ స‌ర్కారు తీరుపై మండిప‌డ్డారు. సెక్యూరిటీ గార్డులు, స్వీప‌ర్లే వైద్యులా? అని ఆయ‌న నిల‌దీశారు. వైద్య ఆరోగ్య శాఖ‌ను నిర్వీర్యం చేసిన ఘనత జ‌గ‌న్ దేన‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకీ వైద్య సేవ‌లు దిగ‌జారుతుండ‌డం వైసీపీ స‌ర్కారు వైఫ‌ల్యాన్ని సూచిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa